Logo

మార్కు అధ్యాయము 12 వచనము 21

మత్తయి 22:25 మాలో ఏడుగురు సహోదరులుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను.

మత్తయి 22:26 రెండవవాడును మూడవవాడును ఏడవవానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి.

మత్తయి 22:27 అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను.

మత్తయి 22:28 పునరుత్థానమందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెనుగదా అని ఆయనను అడిగిరి.

లూకా 20:29 యేడుగురు సహోదరులుండిరి. మొదటివాడొక స్త్రీని పెండ్లిచేసికొని సంతానము లేక చనిపోయెను.

లూకా 20:30 రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లిచేసికొనిరి.

లూకా 20:31 ఆ ప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను.

లూకా 20:32 కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును?

లూకా 20:33 ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి.

మార్కు 2:25 అందుకాయన వారితో ఇట్లనెను తానును తనతో కూడ నున్నవారును ఆకలిగొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదువలేదా?